Friday, December 5, 2008

ముంబై దాడులు - మన నిజమైన శత్రువులు

మొత్తం మీద ముంబైలో తీవ్రవాదులతో పోరు ముగిసి వారిలో ఒకడు సజీవంగా పట్టుబడ్డాడు. నిజం చెప్పాలంటే ఈ పోరు మన పోలీసుల సామర్ధ్యాల కంటే కూడా బలహీనతలనే ఎక్కువగా బయట పెట్టిందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే ఎంత వెనుక ఉన్నామో స్పష్టంగా అర్ధమయ్యాయి. చీకటిలో పోరాడటానికి కావలసిన night vision googles కూడా మన వద్ద లేవని తెలిసేసరికి చాలా బాధ వేసింది. అవి చాల ఖరీదైనవా అంటే ఇక్కడ US లో చిన్న పిల్లలు వాటితో ఆటలాడుకుంటారు. కాని అవి మన భద్రతా దళాల వద్ద లేవు. ఒక్కసారి ఇక్కడ ఎవరినా తుపాకితో బెదిరిస్తున్నారు అని తెలిసిన వెంటనే cops బుల్లెట్ప్రూఫ్ కవచాలు తలపైనుంచి కాళ్ళ వరకు కప్పుకొని వస్తారు. కానీ అలాంటివి మన వారివద్ద లేవు? భద్రతా దళాల వారికీ కనీసం ఈ మాత్రం సదుపాయాలు సమకూర్చుకోకుండా ఎలా ఉన్నాం? మన వద్ద ఆ మాత్రం ధనం కుడా లేదా? బుల్లెట్ ప్రూఫ్ గాజులకు కుడా తీవ్రవాదులు పేల్చిన బుల్లెట్లు తూట్లు వేసాయని చుసేసరికి అసలు నిజంగా మన సామర్ధ్యం అంతేనా అని అనుమనం వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న బ్యాంకులకు కూడా కనీసం 4 సెంటీమీటరుల పొడవున్న బుల్లెట్ ప్రూఫ్ గాజులను చూచేసరికి మనకు అవి ఎందుకు లేవు అని అనుమానం వచ్చింది? అమెరికాకు ఇండియా కు పోలిక కూడదు అని చెప్పవచ్చు. కానీ ఇవి అన్ని కనీసం ఉండవలసిన సామాగ్రి కాదా? మన వాళ్ళు ఎందుకు nerve gas ప్రయోగించలేదు? ఎందుకు అంటే మన భద్రతదళాల వద్ద కనీసం oxygen masks కూడా లేవు.
సరే, నేను ఈ వ్యాసం ఎందుకు వ్రాస్తున్నానో చెబుతాను. మన అందరికీ ఈ శత్రువుల గురించి తెలుసు. కానీ మన మధ్యే ఉంటూ మనకు తెలియని శత్రువుల గురించి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. వారు ఎవరు అంటే muslim apologetics. ముందు ప్రఖ్యాత TIME మాగజైన్లో వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చదవండి. ఈ వ్యాసాలను వ్రాసినది Aryan Baker. ఇలాంటి వారి వల్లనే మనకు తీవ్రవాదులకన్న ఎక్కువ ప్రమాదం ఉంది.
అయ్యా Aryan Baker గారు, ఈ సమాధానం మీ కోసమే. మీరు “the attacks were revenge for the persecution of Muslims in India. We love this as our country, but when our mothers and sisters were being killed, where was everybody?" అని మీ వ్యాసం లో సెలవిచ్చారు. అసలు ముస్లిములను భారతదేశంలో ఎప్పుడు ఎవరు చంపారు? మీరు ౨౦౦౨ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారా ఏమిటి కొంపదీసి? ఎందుకంటే ఆ గొడవలలో 700 పైగా హిందువులు చనిపోయారు. వారిని కాక చూస్తే ముస్లిములు 1300 మంది చనిపోయారు. మరి హిందువుల గురించి ఎందుకు మీరు మాట్లాడరు? పోనీ 1992లో జరినిన బాబ్రి మసీదు గురించి ఐతే అక్కడ ఉన్న రాముడి గుడి గురించి కూడా చెప్పండి. ముస్లిముల అమ్మలను, అక్కలను చెరచి చంపినట్లు చెబుతున్నారు. అవి ఎప్పుడు ఎక్కడ జరిగాయో కుడా వివరిస్తే బాగుండేది. ఆ తీవ్రవాది ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాని చెప్పి అమాయక ప్రజలను ఎందుకు కాలుస్తున్నాడు? మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కూడా చిన్నవయసులో ఎన్నో అవమానాలు జరిగాయి. కాని ఆయన ఏనాడు కూడా ఇతరులను నిర్దాక్షిణ్యంగా చంపలేదే. సరే ఒక్కసారి మీ వాదనను చూద్దాం. మీరు అంటున్నట్లు నిజంగా ఇవాళ ముస్లిములను అప్పటి అంటరానివారి కన్నా మన దేశంలో నీచంగా చూడడంలేదు కదా. నిజం చెప్పాలంటే సాటి హిందువుల కన్నా కూడా ఎంతో మెరుగైన జీవితం అనుభవిస్తున్నారు. వారు వాడితే కరెంటుకు, నీటికీ డబ్బు కట్టనవసరం లేదు, వారి మతం వారిని ఎవ్వరినీ అనుమానం మీద కూడా అరెస్టు చేయకూడదు ఎంత బలమైన సాక్ష్యాలున్నప్పటికీ, ఒకవేళ అరెస్టు చేస్తే వారికి AC రూములు(అదే హిందువులనైతే ఆడవారని కూడా చూడకుండా నగ్నంగా చావబాదుతారు), ఇవి చాలవన్నట్లు వారికి రిజర్వేషన్లు, వారు మక్కా ప్రయాణాలు చేసుకోవడానికి విదేశాలు వెళ్ళడానికి రాయితీలు(అదే హిందువుల పండగల రోజున బస్సు, రైలు ఛార్జీలకు రెక్కలు వస్తాయి. ఈ ప్రభుత్వానికి హిందువుల డబ్బులు కావాలి గాని, వారి మనోభావాలతో పని లేదు). ప్రభుత్వం ముస్లిముల మత విషయాలలో తలదూర్చకూడదు, అదే హిందువుల ప్రతీ మత సంస్థ కూడా ప్రభుత్వనిర్వహణలో ఉండాలి. నిజం చెప్పాలంటే, మన గుడులను మనమే నిర్వహించుకొంటే మనం ఎంతో అద్భుతంగా, పారదర్శకంగా నడిపించగలం. కాని ప్రభుత్వానికి మన గుడులనుంచి ఆదాయం కావాలి గాని వాటి నిర్వహణ అవసరం లేదు. ఇన్ని వున్నా ఇంకా ముస్లిములు వారిని అణిచివేస్తున్నారని, ఎదగనీయడంలేదని చెబుతారు. ప్రభుత్వం, మరియు హిందువులు ఇంకా ఏమి చేస్తే ఈ అపవాదు తొలగిపోతుందో తెలియదు.
వ్యాసంలో ముస్లిములకు తక్కువ జీవితకాలమని, వారి ఆయుర్దాయం తక్కువని, వారిలో అత్యధికులు నిరక్షరాస్యులని, వారికి చాలా తక్కువ జీతం వస్తుందని సెలవిచ్చారు. అయ్యా, వీటికి హిందువలకు ఏమైనా సంభందం వున్నదా? ఈ దెశంలో పేదల సంఖ్య ౩౩ కోట్లు. అందులో ముస్లిములు 15 కోట్లు(అందరు ముస్లిములు పేదలనే కొంచెం సేపు అనుకుందాము) వున్నారు అనుకున్నా, మిగతా 18 కోట్ల మంది హిందువులు లేరా? మిగతా హిందువులు కడుపు నిండా తింటున్నారు కదా అని ఆ 18 కోట్లమందికీ ఆకలి వెయ్యకుండా వుండదు కదా, మరి వారి పరిస్థితి ఏమిటి? మరి ఆ హిందువులందరు ఇతరులను చంపుతున్నారా? ఎంతో మంది హిందువులు పల్లెటూరులొ వున్నవారు ఏమంత ఆరోగ్యంగా ఉన్నారు?
ఒక్కసారి అక్షరాస్యత గురించి మాట్లాడుకుందాము. ఒక పేద హిందువు తన బిడ్డడిని గవర్నమెంటు స్కూలులో చదివిస్తాడు లేకపోతే జీవితాంతం చదువు లేకుండా నిరక్షరాస్యుడుగానే మిగిలిపోతాడు. అదే ఒక ముస్లిము తండ్రి తన పిల్లవాడిని నిరక్షరాస్యుడుగానో లేక మదర్సాకో పంపుతాడు. నిరక్షరాస్యుల గురించి పక్కన పెడితే(ఏ మతంలోనైనా పెద్ద ప్రయోజనం లేదు కాబట్టి) చదువుకున్నవారి సంగతి చూద్దాం. గవర్నమెంటు స్కూలులో ఏమి చెబుతారో మనందరికీ తెలుసు కాబట్టి అది వదిలేద్దాం. ఇక మదర్సాలో ఎమి చెబుతారో చూద్దాం. మదర్సాలో లెక్కలు, ఆంగ్లం, సైన్సు వంటివి చెప్పరు. వారికి పూర్తిగా ఖురాను, అరబిక్, నేర్పిస్తారు. మదర్సాలో విద్య పూర్తయ్యేసరికి ప్రతి బాలుడు ఈ విషయాలలో చాలా ప్రావీణ్యత సంపాదిస్తాడు. ఇది జీవించడానికి ఎంత వరకు పనికివస్తుందో నేను చెప్పనవసరం లేదు అనుకుంటున్నాను. ఈ మొత్తంలో హిందువు పాత్ర ఎంత? ఇలా ముస్లిము జీవితాంతం చదువులేకుండా వుండడానికి కారణం ఎవరు? ఇందులో హిందువు పాత్ర ఎంత? దీనికి అమాయక హిందువును బలిచేయడం ఎంత వరకు సబబు అని అడుగుతున్నాను. ఇందువల్లనే ముస్లిములు అనేకులు ఉద్యోగం లేకుండా ఉన్నారు. మరోక్క విషయం ఇక్కడ మనం అందరం గుర్తించాలి. ఒక హిందూ కుటుంబంలో ఎంత మంది సాధారణంగా ఉంటారు? ఇద్దరు లేక ముగ్గురు. అదే ఒక ముస్లిం కుటుంబంలో అయితే నలుగురి నుంచి పది మంది వరకు ఉంటారు. ఇంత మంది ఉంటే చదువు చెప్పించడం కాస్త ఖర్చుతోకూడుకున్న వ్యవహారమే. అందుకే వారు గవర్నమెంటు స్కూలుకు కాకుండా మదర్సాలకు పంపుతారు, కాని అక్కడ వారికి మేలు కన్న కీడు ఎక్కువ జరుగుతోంది. దీనంతటికీ బాధ్యులు ఎవరు? ఇందులో హిందువుల భాద్యత ఎంత?
ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ప్రతీ రాష్ట్రానికి కనీసం ఒక్క ముస్లిము నాయకుడైనా ఉన్నాడు. అతడు అడిగితే ఈ దేశంలో ముస్లిముల విద్య కొరకు కాస్త ఎక్కువ నిధుల ఇవ్వనివారు ఎవరైనా వున్నారా? వీళ్ళు మాత్రమే కాదు, ఎందరో డబ్బున్న ముస్లిములు ఈ దేశంలో ఉన్నారు. ఉదాహరణకి అజీం ప్రేమ్ జీ. అతను ఎంత ధనవంతుడో మన అందరికీ తెలుసు. కానీ అతను ఏనాడైనా ముస్లిములలో విద్యావ్యాప్తి కొరకు, బాగుకొరకు ప్రయత్నించినట్లు కనబడదు. ముస్లిములే వారి గురించి వారు పట్టించుకోకపోతే, అందుకు హిందువులదా భాద్యత? ఎప్పటిలాగానే ప్రభుత్వాన్ని నిందిచవచ్చు. కాని అదే ప్రభుత్వం హిందువులకు కూడా ఏమి చేయడంలేదు కదా. మరి అలాంటప్పుడు హిందువులను ప్రత్యేకంగా నిందించడం ఎందుకు? అంబేద్కర్ ఇలా ఇతరులను నిందిస్తూ కాలం వ్యర్ధం చేయలేదు. ముందు తను బాగా చదువుకోని, తరువాత తనవారి కోసం, తనలాగా అణగదొక్కబడిన వారి బాగుకోసం ఎంతో కష్టపడ్డాడు. ప్రముఖ ముస్లిమువక్త Dr. Zakir Naik గారు వారి విలువైన సమయాన్ని వెచ్చించి ఇస్లాము గురించి అందరికీ చెబుతారు కదా, అలాంటిది కొంత సమయాన్ని తన వారి బాగు కోసం అస్సలు ప్రయత్నించడు ఎందుకు? హిందువులు ముస్లిములను ఎదగనీయడం లేదు అనేవారికి ఒక్క ప్రశ్న. అబ్దుల్ కలాం గారిని ఎవరు అధ్యక్షుడిగా ప్రతిపాదించారు? హిందూ పక్షపాతిగా పేరెన్నికగన్న BJP కాదా? మరి అధ్యక్షుడిగా కొనసాగనివ్వకుండా ఎవరు అడ్డుపడ్డారో అప్పుడే మరచిపోతే ఎలా? స్వతంత్ర భారతావనికి మొట్టమొదటి Education Minister అయినటువంటి Maulana Abul Kalam Azad గారు ముస్లిముల కోసం, వారిలో విద్యా వ్యాప్తి కోసం ఏమి చేసారు?
చారిత్రకంగా కొన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వ్యాసరచయిత గారు హిందూముస్లిముల మధ్య గొడవలు 1857 నుంచి మొదలైనవని చెప్పారు. పాపం అతనికి చరిత్రలో ఇంత చిన్నవిషయాలు కూడా తెలియనివాడా అనిపించింది. అప్పటివరకు హిందువులు ముస్లిములు సోదరులవలె వున్నారని, అంతవరకు ఇరువురి మధ్య గొడవలు ఏమీ లేనట్లు చెప్పారు. ఒక్కసారి గతంలోకి చూస్తే వారికి చాలా చేదు విషయాలు తెలుస్తాయి. విజయనగర సామ్రాజ్యం ముస్లిములకు వ్యతిరేఖంగా 250 సంవత్సరాలు పాటు పోరాడినది, ఛత్రపతి శివాజీ ముస్లిములను తరిమికొట్టడానికి చేసిన ప్రయత్నాలు పాపం వ్యాసరచయిత గారి కంటికి కనబడలేదు పాపం. మొగలాయిలు సిఖ్ఖులను ఊచకోతకోయడం వల్లనే వారు మొగలాయిలకు సాయం(1857 war) చెయ్యలేదు అనే విషయాన్ని రచయిత ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ మరచిపోయి, కేవలం 1857 నుంచే ముస్లిముల పతనం ప్రారంభమైందని రచయిత గారి అభిప్రాయం. పాపం ఆయన ఇంకొంచెం కృషి చేసి పెద్ద అబద్దం చెప్పవుండాల్సింది. చరిత్ర గురించి ఇలా అబద్దాలు చెప్పేవారు పత్రికా సంపాదకులుగా వుండడం నిజంగా మన దురదృష్టం. ఆంగ్లాన్ని అధికార భాషగా చేయడం ముస్లిముల పాలిట శాపమైందని వారు పేర్కొన్నారు. కాని అది హిందువుల పాలిట శాపమెందుకవలేదని వారు వివరించలేదు. దీనికి జవాబు చాలా చిన్నది. హిందువులు ఆంగ్లంలో అయినా చదువుకోవడానికి వెళ్ళారు, కాని ముస్లిములు మాత్రం చదువును, దానితో పాటు అభివృద్ది అయ్యే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకున్నారు. ఈ విషయాలను రచయిత గారు ఎక్కడా ప్రస్తావించలేదు. రచయిత గారు బ్రిటీషువారు మరియు హిందువులు కలిసి ముస్లిములను ఎదగనీయలేదని వ్రాశారు. Maulana Abul Kalam Azad గారు మనకు విద్యా మంత్రిగా ఏమీ చేయలేకపోయారు ఎందుకో మాత్రం వివరించలేదు. వారిక్ నేను కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. హైదరాబాదును నిజాములు పాలించినప్పుడు 60,000 మందిసైన్యంలో కేవలం 1300 మంది మాత్రమే హిందువులు వున్నారు. ఐనా హిందువులు ఏ రోజూ మాకు అన్యాయం జరిగిందని బాధ పడలేదే? ఇప్పటి పేదరికానికి ముస్లిములే కారణం అని వారిని చంపడం లేదే? ఈ నాటి వరకు కూడా ముస్లిములు ఖురాను, అరబిక్, ఉర్దూకిచ్చినంతటి ప్రాముఖ్యం నిజమైన చదువులకు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళను ఇతరులు అణిచివేస్తున్నారని గోలచేస్తారు.
అత్యధికులు వారిని నమ్మడం లేదని చెప్పడు. నిజమే 2000 సంవత్సరానికి ఇవ్వల్టికీ పరిస్తితులలొ ఎంతో మార్పు వున్నది. దానికి కారణం కూడా వారే. ప్రతీసారి బాంబు పేలుళ్ళలో వారిపేరు తప్ప ఇంక ఏదీ వినపడడం లేదు. ముస్లిముల వెనబాటుతనానికి కారణం పేదరికం, అధిక జనాభా(కుటుంబంలో), విద్య లేకపోవడం, వారి మతంలో వారి గురించి, వారి బాగు గురించి ఆలోచించేవాళ్ళు నిజంగా లేకపోవడం, వారి మత అలవాట్లు. ఇవి వారికి నిజమైన ప్రతిబంధకాలు. అంతే కాని హిందువులు ఎదగనీయడంలేదు అనే కుంటి సాకు ఇకనైనా వదిలివేయడం వారి బాగుకే మంచిది. ఈ వ్యాసరచయిత అభిప్రాయంలో ముస్లిములు ఇలా ఇతరులని చంపడం పాపమేకాదు. నిజం చెప్పలంటే ఇలాంటి రచయితలే మనకు మొదటి శత్రువులు.
(ఈ వ్యసాన్ని నా బ్లాగులో వుంచుకోవడానికి అంగీకరించిన నా మిత్రునకు నా హృదయపూర్వక thanks. ఈ వ్యాసం ఆంగ్లం కొరకు ఇక్కడ క్లిక్కండి.)

5 comments:

యార్లగడ్డ కిరణ్ కుమార్ said...

you are 100% correct. America used to support PAK before, since they know pain now,they understood, but some of the idiots like this still supporting muslim terrorists

SaveNatives said...

Very well writte. Please keep up the good work.

narasimha rao yaddanapudi said...

very good , one more thing is that makka the holy city of muslims is having a shiva temple (kaba)

as in that shivaligam is they called it is kaba and when they when makka they kiss it and bow under it here my quesen is why they are prying a stone like they kafirs do then they will kill that qusen and that person

Unknown said...

brother whats your name ?

christianity oka matham kadu ,
edi oka margam ,its a only way to go HEAVEN Throught JESUS,,Better to you to wake up (till now ur in sleep) and follow JESUS OTHERWISE ONE DAY U WILL FELT UNHAPPY, THAT DAY NO ONE CAN SAVE U

JESUS IS LIVING GOD said...

my dear sir you said that maria and yesepu went to pay tax but you see the BIBLE very clearly written they went for senses counting.this senses is the first senses that's why while counting years we mention BC and AD.If you don't know the truth go and ask someday.but don't write nonsense.

yours loving brother

ramesh